'బాబు, కిరణ్ కనుసైగల్లో అశోక్ బాబు'

21 Dec, 2013 14:53 IST|Sakshi

హైదరాబాద్ : ఏపీ ఎన్జీవో అఖిలపక్ష సమావేశం వద్ద దళిత బహుజన పార్టీ శుక్రవారం ఆందోళనకు దిగింది. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి కనుసైగల్లో ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు పనిచేస్తున్నారని ఆపార్టీ కార్యకర్తలు ఆరోపించారు. సమైక్యం ముసుగులో డ్రామలు ఆడుతున్నారని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు సమైక్యం విషయంలో రాజీపడేది లేదని అశోక్ బాబు స్పష్టం చేశారు. ఉద్యమ పంథాను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు