సాక్షి, విజయవాడ కల్చరల్: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు దాండియా, దర్బా నృత్యాలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 7 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ఫుట్బాల్ గ్రౌండ్లో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. గుజరాత్ నుంచి ప్రముఖ గాయకులు, సంగీతకారులు విచ్చేసి స్థానిక మార్వాడీ యువతకు ఈ అంశాల్లో శిక్షణ నిర్వహిస్తున్నారు. బెంజ్ సర్కిల్లోని జ్యోతి హాల్లో 20 రోజులుగా ఈ శిక్షణ ఇస్తున్నారు.