ఆ వంతెన మొత్తం అంధకారం

18 Jul, 2019 10:39 IST|Sakshi

సాక్షి, బండిఆత్మకూరు(కర్నూలు) : మండల కేంద్రమైన బండిఆత్మకూరు బస్టాండ్‌ నుంచి గ్రామంలోకి వెళ్లే వంతెనపై అంధకారం అలుముకుంది. కొన్ని రోజులుగా వీధిదీపాలు వెలగక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో రాత్రి సమయాల్లో వంతెనపై ప్రయాణించడానికి గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ప్రమాదవశాత్తు బైకు అదుపు తప్పితే వంతెనపై నుంచి కిందికి పడితే ప్రాణాపాయం తప్పదని, అధికారులు స్పందించి విద్యుత్‌ దీపాలు వెలిగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు