రాష్ట్ర చరిత్రలో డిసెంబర్ 5 బ్లాక్ డే: విశ్వరూప్

6 Dec, 2013 14:24 IST|Sakshi

రాష్ట్ర విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ముఖ్యమంత్రి తెలివితక్కువతనంతో వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే డిసెంబర్‌ 5  బ్లాక్‌ డే అని విశ్వరూప్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఆందోళనలో పాల్గొనడం హాస్యాస్పదమని విశ్వరూప్‌ అన్నారు.

మరిన్ని వార్తలు