ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్ నిరాకరణ

21 Jan, 2016 04:37 IST|Sakshi

బియ్యపు మధుసూదన్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయమూర్తి

 తిరుపతి లీగల్: రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను బుధవారం న్యాయమూర్తి నిరాకరించారు. తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా మేనేజర్‌పై దాడి చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి నెల్లూరు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. బెయిల్ కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ తిరుపతి ఐదో అదనపు జిల్లా జడ్జి శ్యామ్‌సుందర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వారిని తమ కస్టడీకి అప్పగించాలంటూ గాజులమండ్యం పోలీసులు దాఖలు చేసిన వ్యాజ్యం శ్రీకాళహస్తి జూనియర్ జడ్జి కోర్టులో పెండింగ్ ఉండడంతో ఈ ద శలో బెయిల్ ఇవ్వలేమని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు