కొనసాగుతున్న వాయుగుండం

8 Aug, 2019 11:05 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్‌ సమీపంలో వాయుగుండం కొనసాగుతోంది. అంబికాపుర్‌కు 90 కి.మీ దూరంలో కేంద్రికృతమైంది. నేటి అర్ధరాత్రి,రేపు ఉదయానికి బలహీన పడి అల్పపీడనంగా మారే అవకాశముంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలు పడ్డాయి. తెలంగాణలో మోస్తరు భారీ వర్షాలు పడే అవకాశముంది. తీరం వెంట ఈదురు గాలులు కొనసాగుతున్నాయి.మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు  హెచ్చరిక జారీ చేశారు.
 

మరిన్ని వార్తలు