కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

17 Jul, 2014 10:21 IST|Sakshi

విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ  అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తా మీదగా దక్షిణ తమిళనాడు వరకూ ఈ అల్పపీడన ద్రోణి ఆవరించి ఉంది. దీంతోపాటు రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
 
 

మరిన్ని వార్తలు