బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

10 Sep, 2013 10:26 IST|Sakshi

విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కదులుతోంది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా మారాయని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు. మరోవైపు హైదరాబాద్ లోనూ గతరాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.

 

మరిన్ని వార్తలు