బందరు బయలుదేరిన చినరాజప్ప

4 Apr, 2016 12:44 IST|Sakshi

ఈరోజు విజయనగరంలో పర్యటించాల్సిన ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకొని మచిలీపట్నం బయలుదేరారు. స్థానిక నిజాంపేటలో వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యతో పట్టణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అలజడులు సంభవించే అవకాశం ఉండటంతో.. ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా శాంతి భద్రతలు పర్యవేక్షించడానికి ఆయన వెళ్తున్నట్లు సమాచారం.
 

మరిన్ని వార్తలు