వేణుగోపాల్ రెడ్డిపై దేశపతి ఆగ్రహం!

30 Jul, 2014 19:16 IST|Sakshi
హైదరాబాద్: ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డిపై తెలంగాణ వికాస సమితి దేశపతి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేణుగోపాల్ రెడ్డి ఆంధ్రా మేధావుల సంఘం చైర్మన్‌లా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. 
 
ఎంసెట్‌ కౌన్సెలింగ్ ఆలస్యం కావడం కొత్త కాదని దేశపతి అన్నారు. తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దేశపతి శ్రీనివాస్‌ తెలిపారు. 
మరిన్ని వార్తలు