చిత్తూరులో ఏనుగుల బీభత్సం

6 Dec, 2015 11:19 IST|Sakshi

చిత్తూరు జిల్లాలో వరసగా రెండో రోజు.. ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బెరైడ్డిపల్లి మండలం వెంగంవారిపల్లె గ్రామం శివారులోని పంట పొలల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు పంటలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఇప్పటికే ఏనుగుల దాడిలో గ్రామస్థులు వరి, రాగి, బీన్స్ పంటలను నష్టపోయారు.

కాగా ఈ రోజు ఉదయం వాటిని తర మివేయడానికి ప్రయత్నించిన కొందరు గ్రామస్థులపై ఏనుగులు దాడికి దిగాయి. దీంతో గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. తమ గ్రామాల్లో తరచూ ఏనుగులు పంటలను నాశనం చేయడంతో పాటు.. గ్రామస్తులపై దాడికి దిగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అటవీ అధికారులకు ఎన్నిమార్లు మొర పెట్టుకున్నా.. ఫలితం ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

మరిన్ని వార్తలు