నిర్ణయాత్మక పార్టీగా తీర్చిదిద్దుతా

23 Sep, 2014 00:47 IST|Sakshi
నిర్ణయాత్మక పార్టీగా తీర్చిదిద్దుతా

ముమ్మిడివరం: ‘మీ అండదండలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్ణయాత్మక రాజకీయ పార్టీగా తీర్చుదిద్దుతా’నని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఉద్ఘాటించారు. దానికి ప్రతి కార్యకర్త కార్యోన్ముఖులు కావాలని కోరారు. ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం సోమవారం నియోజకవర్గ కోఆర్డినేటర్ గుత్తుల సాయి అధ్యక్షతన స్ధానిక కోకోనట్ మర్చంట్ అసోిసియేషన్ హలులో జరిగింది. ఈసందర్భంగా నెహ్రూ  మాట్లాడుతూ మూడునెలలు తిరక్కుండానే  చంద్రబాబు ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను వేధిస్తే జిల్లా పార్టీ నాయకత్వం మీకు అండగా ఉంటుందన్నారు.
 
అవసరమైతే వీధి పోరాటాలకైనా సిద్ధమన్నారు. పీఏసీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ శుష్క వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే ప్రజా విశ్వాసం కోల్పోయారన్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జిల్లా ఎస్సీసెల్ కన్వీనర్ శెట్టిబత్తుల రాజబాబు, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, అమలాపురం కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు మాట్లాడుతూ కల్లబొల్లి హామీలతో ప్రజలను మోసగించి చంద్రబాబు అధికారాన్ని దక్కించుకున్నారన్నారు. వైఎస్ సంక్షేమ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.

పార్టీ జిల్లా ప్రచారకర్త రావూరి వెంకటేశ్వరావు చ ంద్రబాబు పాలనపై వ్యంగ్యాస్త్రాలు విసురుతూ కార్యకర్తలను ఉత్తేజ పరిచారు. రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ,సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి,  జిల్లా యువత అధ్యక్షుడు ఎ.అనంత ఉదయ భాస్కర్, పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, దొంగ రామసత్యనారాయణ,  జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పెన్మత్స చిట్టిరాజు,పెయ్యల చిట్టిబాబు, మండల కన్వీనర్లు జగతా పద్మనాభం, విత్తనాల వెంకటరమణ, కాళే రాజబాబు, దడాల బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు