మహానేత వైఎస్ మరణంతో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటి రచ్చబండ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గడికోట మాట్లాడుతూ రచ్చబండ కార్యక్రమం రూపకర్త కూడావైఎస్సే అన్నారు. వైఎస్ ఫొటో వేదికపై లేకపోవడం బాధాకరమన్నారు. రాయచోటి ప్రజల సౌకర్యార్థం 50 పడకల ఏరియా ప్రభుత్వాసుపత్రిని వందపడకల ఆసుపత్రిగా మార్చాలని కోరారు. రింగురోడ్డును నాలుగులైన్ల రహదారిగా తీర్చిదిద్దాలన్నారు. నియోజక వర్గానికి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల, మహిళా ఉర్దూ డిగ్రీకళా శాల, ప్రభుత్వ ఐటి ఐ, ప్రభుత్వ ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.