తిరుమలలో ప్రమాదవశాత్తు భక్తుడు మృతి!

23 Jun, 2014 16:22 IST|Sakshi
చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో సోమవారం అపశృతి చోటు చేసుకుంది. తిరుమలలోని మూలమఠం పైనుంచి కిందపడి భక్తుడు మృతి చెందినట్టు తెలిసింది. 
 
మృతుడు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరంటవాసి రామారావుగా గుర్తించారు. ఇటీవల కాలంలో తిరుమలలో ప్రమాదవశాత్తూ భక్తుడు మరణించడం ఇది రెండవ ఘటన.
 
క్యూ కాంప్లెక్స్ నుంచి కిందపడి చిరువ్యాపారి గజేంద్ర అనే వ్యక్తి మృతి చెందగా,  టీటీడీ హోంగార్డు జె.సురేంద్ర(30) విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. తిరుమలలో అపశృతులు చోటుచేసుకోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
మరిన్ని వార్తలు