తిరుమలకు పోటెత్తిన భక్తులు

9 Jun, 2017 09:49 IST|Sakshi
తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. 31 కంపార్టుమెంట్లు నిండి వెలుపల కూడా స్వామివారి దర్శనార్థం భక్తులు బారులు తీరి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.

కాలిబాటన వచ్చిన భక్తులకు 12 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 73,797 మంది దర్శించుకున్నారు. కాగా, శ్రీవారి జ్యేష్టాభిషేకం శుక్రవారంతో ముగియనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు