తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

15 Nov, 2014 07:07 IST|Sakshi
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.  స్వామివారి సర్వ దర్శనానికి 5 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం, నడకదారి భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది.

ఇదిలాఉండగా, ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 17 కంపార్ట్మెంట్లు నిండాయి. భక్తుల కోసం కేటాయించబడిన ఉచిత, రూ. 100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ. 50, రూ. 500 గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. భక్తుల ఉచిత గదులు 69 ఖాళీగా ఉన్నాయి.  

గదుల వివరాలు:
రూ. 50 గదులు 25,
రూ. 100 గదులు 78,
రూ. 500 గదులు 9 ఖాళీగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు