చిరు వ్యాపారుల ధర్నా

10 Jul, 2015 14:10 IST|Sakshi

అనంతపురం: అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన చిరు వ్యాపారులు ధర్నాకు దిగారు. శుక్రవారం ముదిగుబ్బ వైఎస్సార్‌సీపీ ఎంపీపీ మాలతి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో చిరు వ్యాపారులు కలెక్టరేట్‌కు చేరుకొని నిరసన తెలిపారు. ముదిగుబ్బ గ్రామపంచాయతీ అధికారులు ఫుట్‌పాత్‌పై వ్యాపారాలు వెంటనే తొలగించాలని నోటీసులు జారీ చేసింది. శనివారంతో నోటీసుల గడువు ముగియనుండటంతో పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగారు. వెంటనే నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు