తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి

11 Aug, 2019 16:39 IST|Sakshi

సినీ దర్శకుడు వి.వి వినాయక్‌ 

సాక్షి, విజయవాడ: దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్‌రావు వారసుడిగా రాజా కీర్తి ప్రతిష్టతలు ఇనుమడింప చేయాలని సినీ దర్శకుడు వి.వి. వినాయక్‌ ఆకాక్షించారు. కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా ఆదివారం విజయవాడలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన వినాయక్‌ మాట్లాడుతూ.. ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న గొప్ప నాయకుడిగా జక్కంపూడి రామ్మోహన్‌రావును ప్రస్తుతించారు. తండ్రి బాటలో నడిచి ఆయన ఆశయాలను రాజా నెరవేర్చాలని అన్నారు. జక్కంపూడి రాజాకు కాపు కార్పొరేషన్‌ పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు