వైద్యశాఖకు జబ్బు:మంత్రి కామినేని

29 Sep, 2014 13:09 IST|Sakshi
మంత్రి కామినేని శ్రీనివాస్

కడప: ఏపిలో వైద్యశాఖకు జబ్బు చేసిందని ఆరోగ్య, వైద్య విద్యా శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. దీనిని గాడిలో పెడతామని చెప్పారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు స్థానికంగానే నివాసం ఉండాలని చెప్పారు.

అనంతరం మంత్రి పులివెందులలోని ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అసౌకర్యాలపై సూపరింటెండెంట్ను మందలించారు.

ఇదిలా ఉండగా, మంత్రి .కామినేని శ్రీనివాసరావు  పులివెందులలో బిజెపి కార్యాలయాన్ని ప్రారంభించారు.
**

మరిన్ని వార్తలు