హైదరాబాద్ : సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం మంత్రి పార్థసారధి ఎమ్మెల్యేగా అనర్హుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అడుసుమిల్లి జయప్రకాష్ రెడ్డిఅన్నారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ పార్థసారధిని అనర్హుడుగా ప్రకటించాలని స్పీకర్కు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు.
హైకోర్టు తీర్పు మేరకు పార్థసారధి లక్షన్నర జరిమానా కట్టారని, ఆర్టికల్-80ఈ ప్రజా ప్రాతినిత్య చట్టం కింద ఆయన సభ్యత్వాన్ని కోల్పోతారన్నారు. ఈ విషయం స్పీకర్తో చెప్పగా న్యాయనిపుణులతో చర్చిస్తానని చెప్పినట్లు అడుసుమిల్లి తెలిపారు. మంత్రి పార్థసారధిని డిస్క్వాలిఫై చేయకపోతే హైకోర్టుకు వెళతామని ఆయన హెచ్చరించారు.