'సీఎం పార్టీ పెడితే.. రూ. 10 లక్షలు ఫండ్'

5 Feb, 2014 19:20 IST|Sakshi
'సీఎం పార్టీ పెడితే.. రూ. 10 లక్షలు ఫండ్'

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రా రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసమర్థుడు, అవినీతి పరున్ని ముఖ్యమంత్రిని చేయడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని డీఎల్ విమర్శించారు.

కిరణ్ పిరికివాడు, అసమర్థుడని దుయ్యబట్టారు. ఆయన కొత్త పార్టీ పెడతారని తాను భావించడం లేదని డీఎల్ అన్నారు. సీఎం పార్టీ పెడితే పది లక్షల రూపాయిలు విరాళం ఇస్తానని డీఎల్ సవాల్ విసిరారు.

మరిన్ని వార్తలు