'ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి'

31 Aug, 2015 17:02 IST|Sakshi

శింగనమల (అనంతపురం): ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. మాదిగ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతపురం జిల్లా శింగనమల తహశీల్దార్ కార్యాలయం ముందు సోమవారం మాదిగా హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు పేరూరు శ్రీరాములు ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని.. డప్పు కళాకారులకు నెలకు రూ. 2 వేలు భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు.

మరిన్ని వార్తలు