పిచ్చికుక్కల స్వైర విహారం

28 Jun, 2015 14:58 IST|Sakshi

ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని కొండెపి మండలంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆదివారం ఉదయం మండల కేంద్రంతో పాటు.. దాసిరెడ్డిపాలెం గ్రామంలో పిచ్చికుక్కలు పలువురిని గాయపరిచాయి. గ్రామానికి చెందిన రెండు వీధికుక్కలను ఒక పిచ్చి కుక్క కరవడంతో వాటికి పిచ్చెక్కి గ్రామస్తుల పై దాడి చేస్తున్నాయి. దీంతో గ్రామంలోని ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధులతో పాటు.. పదిమంది చిన్నారులను కరవడంతో.. వారిని ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు