'రాజధాని' పేదలకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి

14 Mar, 2015 11:43 IST|Sakshi
'రాజధాని' పేదలకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి

గుంటూరు: రాజధాని ప్రాంతంలోని భూమి లేని పేదలకు ఒక్కో కుటుంబానికి 5 ఎకరాల అటవీభూమి ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం గుంటూరులో డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాట్లాడుతూ... 18 సంవత్సరాలు నిండినవారికి ఉపాధి చూపేంత వరకు నెలకు రూ. 5 వేల భృతి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. అనంతవరంలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని మరో తిరుపతిలా అభివృద్ధి చేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు