సీఎం సహాయనిధికి భీమవరం ఎమ్మెల్యే రూ. 1.82 కోట్ల విరాళం

14 May, 2020 20:50 IST|Sakshi

సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌  కోటి 82 లక్షల 4వేల 312 రూపాయలను విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని భీమవరం ప్రజల తరపున సీఎంకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీసివాస్‌ పేర్కొన్నారు. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని సమక్షంలో ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు.

మరిన్ని వార్తలు