రూ.6 వేల నుంచి రూ.12 వేలకు పెంపు
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్టులో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రలు, టీమ్ లీడర్ల వేతనాలను పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వేతనాలు పెంచిన తర్వాత ఆరోగ్య మిత్రల(పీహెచ్సీ ఆరోగ్యమిత్ర/నెట్వర్క్ ఆరోగ్య మిత్ర) వేతనం రూ.12,000, టీమ్లీడర్ల వేతనం రూ.15,000 అందుకోనున్నారు. ప్రస్తుతం ఆరోగ్య మిత్రల వేతనం రూ.6,000, టీమ్లీడర్ల వేతనం రూ.10,600గా ఉంది.