తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

31 May, 2017 11:26 IST|Sakshi
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) స్వామివారిని 96,113 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.54 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
మరిన్ని వార్తలు