సాక్షి, అమరావతి: ఇటలీ నుంచి రాష్ట్రానికి వచ్చిన భారతీయులంతా కోవిడ్-19(కరోనా వైరస్) నేపథ్యంలో తప్పనిసరిగా 14 రోజుల పాటు ఇళ్లల్లోనే ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి వారిని కోరారు. కాగా బుధవారం ఇటలీ నుంచి ఏపీకి నాలుగు విడతలుగా 75 మంది భారత ప్రయాణికులు ఏపీకీ వచ్చారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక గదుల్లోనే ఉండాలని ఆయన సూచించారు. గుదుల్లో ఉన్నన్ని రోజులు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎవరనీ కలవోద్దని హెచ్చిరించారు. అలాగే వారి గది దరిదాపుల్లోకి కూడా పెద్దవాళ్లను కానీ చిన్నపిల్లలు వెళ్లకుండ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వారు తరచు చేతులను సబ్బుతో కానీ హ్యాండ్వాష్లతోని కడుక్కోవాలని చెప్పారు. ఇతరులు తమ బట్టలు, టవళ్లు, తదితర వాటిని ముట్టుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. వారి రూంకు అటాచ్డ్ బాత్రూం ఉంటే దానిని వారు మాత్రమే వాడాలని, ఇతరులు వాడకూడదని తెలిపారు. ఒకవేళ ఇంట్లో ఒకే బాత్రూం ఉంటే మిగతా కుటుంబ సభ్యలు వాడాకే వారు వాడాలని చెప్పారు.
కరోనాతో వ్యక్తి మృతి : భారత్లో తొలి కేసు..!
బాత్రూమును వాడాక..