గుంటూరు: కృష్ణా పుష్కరాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు డ్రోన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో బుధవారం డ్రోన్ పనితీరును ఆయన పరిశీలించారు.
పుష్కరాల సమయంలో వీటిని వినియోగించనున్న బృందానికి నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. డ్రోన్ ద్వారా సమాచారం అందుకున్న సిబ్బంది తక్షణమే ఆ సమాచారాన్ని అధికారులు అందజేస్తారన్నారు. అనుమానిత వ్యక్తులపై నిఘా పెంచవచ్చని పేర్కొన్నారు. డ్రోన్ ద్వారా వచ్చే సమాచారం కమాండ్ కంట్రోల్రూమ్కు చేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు జె.భాస్కరరావు, సుబ్బారాయుడు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.