దుర్గగుడి పాలకమండలి సమావేశం

11 Apr, 2018 16:51 IST|Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడలో దుర్గగుడి పాలక మండలి సమావేశం బుధవారం జరిగింది. ఈవో పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. దుర్గగుడికి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. అదే విధంగా ఈ సమావేశంలో ప్రసాదం టెండర్లకు పాలకమండలి ఆమోదం తెలిపింది. పాడైపోయిన పాత బస్సులను వేలం వేయాలని సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఏపీ ప్రత్యేక హోదా కోసం మే 3 నుంచి 7 వరకు అతిరుద్రమహా చండీయాగం నిర్వహించనున్నట్టు ఈవో పద్మ తెలిపారు.

మరిన్ని వార్తలు