ప్రేమ పేరుతో మోసం చేశాడు: డబ్బింగ్‌ ఆర్టిస్ట్

18 Apr, 2017 07:04 IST|Sakshi

గుంటూరు: గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులో డబ్బింగ్‌ ఆర్టిస్ట్ సుజాత.. భర్త యశ్వంత్‌ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని తనను మోసం చేశాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మౌనదీక్షకు దిగింది.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో యశ్వంత్‌ పనిచేస్తున్నాడు. తనకు ఫేస్‌బుక్‌ ద్వారా అతను పరిచయమయ్యాడని సుజాత్‌ చెప్పింది. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారిందని, యశ్వంత్‌ పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా తాను అంగీకరించానని చెప్పింది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత అతను తనను మోసం చేశాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.

మరిన్ని వార్తలు