ఏపీలో 74 కేంద్రాల్లో ఈ సెట్

14 May, 2015 08:49 IST|Sakshi
ఏపీలో 74 కేంద్రాల్లో ఈ సెట్

అనంతపురం: పాలిటెక్నిక్ విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ లో ప్రవేశం పొందే ఈ సెట్ ఎంట్రెన్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ లో నేడు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 74 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అందుకుగాను రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పరిటాల సునీత, కామినేని శ్రీనివాసరావు ఈ సెట్ పరీక్షకు 'ఎల్-2' సెట్ ను అనంతపురం జెఎన్ టీయూ లో గురువారం ఉదయం విడుదల చేశారు. రాష్టాన్ని నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తోందని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. షెడ్యూలు ప్రకారం తరగతులు, పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని గంటా తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు