విద్యతోనే అసలైన గుర్తింపు: డీజీపీ ప్రసాదరావు

3 Mar, 2014 03:25 IST|Sakshi

హైదరాబాద్, న్యూస్‌లైన్: విద్యతోనే సమాజంలో ప్రతి ఒక్కరికీ అసలైన గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ అధికారుల ఫోరం ఆదివారమిక్కడ నిర్వహించిన పౌరసేవల అవగాహనా కార్యక్రమంలో డీజీపీ పాల్గొని మాట్లాడారు.
 
పేదరికంలో పుట్టిన తాను ఇంటర్ వరకూ తెలుగు మీడియంలోనే చదివానన్నారు. మిత్రుల సహకారంతో ఇంగ్లిషు నేర్చుకున్నానని.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌కు ఎంపికయ్యాయని చెప్పారు. తల్లి సుశీలమ్మ, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగానని తెలిపారు. వైఎస్‌ఆర్ మరణం సమయంలో తాను పోషించిన పాత్ర వృత్తిపరంగా మరిచిపోలేని ఘటన అని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ సీఎస్ కాకి మాధవరావు, ఐఆర్‌ఎస్ అధికారి ఎ.భరత్‌భూషణ్, ఐపీఎస్ అధికారులు ప్రవీణ్‌కుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ దంపతులతోపాటు, ఆయన మాతృమూర్తి సుశీలమ్మను సన్మానించారు.

మరిన్ని వార్తలు