వేపాలపల్లెలో ఆటో బోల్తా : 8 మందికి గాయాలు

10 Jun, 2016 10:22 IST|Sakshi

చిత్తూరు : చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం వేపాలపల్లె క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.... క్షతగాత్రులను తంబళ్లపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అయితే అవులవారిపల్లెకు చెందిన నాగరత్తమ్మ (42), పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఉప్పన్న (52)ల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు