తూర్పుగోదావరి : తనకు తొంబయ్యేళ్లున్నా పింఛను ఇవ్వడంలేదంటూ కరకుదురుకు చెందిన వృద్ధుడు పెమ్మనబోయిన వీర్రాజు జగన్ ఎదుట వాపోయాడు. తన భార్యతో కలిసి కరకుదురులో పాదయాత్రలో ఉన్న జగన్కు తన గోడును విన్నవించుకున్నాడు. ఇచ్చే పింఛనును అన్యాయంగా తీసేశారంటూ వృద్ధులు జగన్కు చెప్పారు.