వృద్ధ దంపతుల ఆత్మహత్య

9 May, 2015 13:37 IST|Sakshi
వృద్ధ దంపతుల ఆత్మహత్య

చిత్తూరు: కుటుంబ కలహాలతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఎస్. శాంతంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.  శాంతంపల్లిలో కామసముద్రం మునప్ప(70), నారాయణమ్మ(65) దంపతులు తమ పిల్లలకు దూరంగా గ్రామంలోని పొలాల్లో ఇళ్లు కట్టుకొని జీవిస్తున్నారు. అయితే ఇరువరి మధ్య ఇటీవల చిన్న తగదా చోటు చేసుకుంది.

దాంతో తీవ్ర మనస్థాపం చెందిన నారాయణమ్మ శుక్రవారం ఉదయం భర్తలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.  ఆ విషయం తెలిసిన గ్రామస్తులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఇంటికి చేరిన మునప్ప... విషయం తెలుసుకుని ఆసుపత్రికి వెళ్లి... ఆమెను  చూసి మనస్థాపం చెందాడు.

ఇంటికి తిరిగి వచ్చి అదే రోజు సాయంత్రం తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో విషయం తెలిసిన గ్రామస్తులు అతనిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నారాయణమ్మ రాత్రి మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు