గుంటూరు: పాత గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధుడిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చారు.
స్థానిక నవభారత్ నగర్ ఒకటో వీధిలో నివాసముంటున్న సాంబశివరావు(70)ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.