విద్యత్‌ఘాతంతో లైన్‌మెన్‌ మృతి

9 Mar, 2017 11:54 IST|Sakshi
విజయనగరం: ట్రాన్స్‌ఫార్మర్‌పై ఫ్యూజ్‌ మారుస్తుండగా, విద్యుత్‌ఘాతానికి గురై లైన్‌మెన్‌ మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని గాజలరేగా కామాక్షి దాల్‌మిల్లులో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే  మహ్మద్‌ రషీద్‌ విద్యుత్‌ శాఖలో లైన్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈ గురువారం ఉదయం దాల్‌మిల్లులో ఫ్యూజ్‌ పోయిందని సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్న రషీద్‌ ఫ్యూజ్‌ మారుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ఘాతానికి గురై మృతిచెందాడు. 
మరిన్ని వార్తలు