-

మహిళను తొక్కి చంపిన ఏనుగులు

30 Dec, 2014 09:06 IST|Sakshi
మహిళను తొక్కి చంపిన ఏనుగులు

చిత్తూరు:  మరోసారి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మంగళవారం ఉదయం కుప్పం సరిహద్దుల్లో ఏనుగులు చేసిన దాడిలో ఓబమ్మ(50) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది.  పశువులను కాయడానికి అటవీ ప్రాంతానికి వెళ్లని ఆమెపై ఏనుగులు  ఆకస్మికంగా దాడి చేసి తొక్కి చంపాయి.  ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. 

(రైతును తొక్కి  చంపిన ఏనుగులు)

ఈ మధ్య కాలంలో అటవీ ప్రాంతానికి వెళ్లిన జనాలపై ఏనుగులు దాడి చేయడం అక్కడ కలకలం సృష్టిస్తోంది. అంతకుముందు వీ కోట మండలం కారగల్లులో ఏనుగులు చేసిన దాడిలో  ఓ రైతు మృతి చెందిన విషయం తెలిసిందే. 

 

మరిన్ని వార్తలు