పంట పొలాలపై గజరాజుల బీభత్సం

30 Aug, 2015 23:43 IST|Sakshi

కుప్పం : చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని కొన్ని గ్రామాల పంట పొలాలపై ఏనుగులు దాడి చేస్తున్నాయి. మండలంలోని కంగోలి, రాముల గుట్టచేను ప్రాంతాల్లోని పంటపొలాలను నాశనం చేశాయి. గజరాజుల బీభత్సంతో గ్రామస్తులు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఏనుగులను తరిమేందుకు గ్రామస్థులు యత్నిస్తుండగా, అటవీశాఖ అధికారుల జాడ కనబడటం లేదు. ఈ ప్రాంతాల్లో ఏనుగుల దాడులు జరగడం సర్వసాధారణంగా మారింది.

మరిన్ని వార్తలు