నీళ్లు అనుకొని విషం తాగిన ఉద్యోగి మృతి

27 Oct, 2013 20:52 IST|Sakshi

హైదరాబాద్ : మంచి నీళ్లు అనుకుని గుర్తు తెలియని విషాన్ని తాగిన ఓ ఉద్యోగి ఆదివారం మృతి చెందాడు. శంషాబాద్ మండల కేంద్రంలోని ఆర్బీనగర్ లో నివాసముండే విశ్వనాథం రాజీవ్ గాంధీ విమానాశ్రయంలోని నర్సరీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో నెల 19న నర్సరీలో పనిచేసిన తర్వాత అలసటకు గురైన అతను ఓ బాటిల్ లో నీళ్లలా ఉన్న విషాన్ని తాగాడు. అనంతరం అతను తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఉద్యోగి మృతి చెందాడు.

 

మృతుడికి భార్య ఉమతో పాటు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు