ఒంగోలు: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మృణాళిని కాన్వాయ్ను శుక్రవారం మధ్యాహ్నం ఒంగోలులోని చర్చి సెంటర్లో హౌసింగ్ బోర్డు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అడ్డుకున్నారు. నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె కలెక్టరేట్ మీదుగా కాన్వాయ్తో వస్తున్నట్లు తెలుసుకున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. కాన్వాయ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన 13 మందిని అరెస్టుచేసి పోలీసు స్టేషన్కు తరలించారు.