వడదెబ్బతో ఉపాధి కూలి మృతి

22 Apr, 2016 11:27 IST|Sakshi

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం ఊరగాంలో ఉపాధి కూలీ వడదెబ్బతో చనిపోయాడు. గ్రామానికి చెందిన తెల్ల మథేను(55) శుక్రవారం ఉదయం గ్రామ చెరువులో జరిగే ఉపాధి పనులకు వెళ్లాడు. పది గంటల సమయంలో వేడిగాలులు, ఎండతీవ్రతకు తీవ్ర అస్వస్థతకు గురైన మథేను అక్కడికక్కడే చనిపోయాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

మరిన్ని వార్తలు