కృష్ణా ఎక్స్ప్రెస్కు తప్పిన ముప్పు

11 Dec, 2013 10:11 IST|Sakshi

ఆలేరు : ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న కృష్ణ ఎక్స్ప్రెస్కు తృటిలో ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా ఆలేరు వద్ద ఇంజన్ నుంచి రెండు బోగీలు విడిపోయి.... రైల్వే బ్రిడ్జిపై నిలిచిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురి అయ్యారు. కప్లింగ్ ఊడిపోవటం వల్లే ఈ సంఘటన జరిగినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. 

కాగా ఆలేరు రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరిన కొద్ది నిమిషాల్లోనే ఈ సంఘటన జరగటంతో పెను ప్రమాదం తప్పింది. రైలు నెమ్మదిగా వెళ్లుతుండటంతో బోగీలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు విషయాన్ని గుర్తించి రైలును వెనక్కి రప్పించారు. విడిపోయిన బోగీలను ఇంజన్కు కలిపేందుకు రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ సంఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.

మరిన్ని వార్తలు