విద్యార్థిని చితకబాదిన టీచర్‌

22 Jan, 2020 12:01 IST|Sakshi
వీపు, నడుముపై వాతలు చూపుతున్న విద్యార్థి

కర్నూలు, దేవనకొండ: మండలకేంద్రమైన దేవనకొండ జెడ్పీ పాఠశాల ఇంగ్లిషు టీచర్‌ అరుణ కుమారి పదోతరగతి విద్యారి వీరేష్‌ను తీవ్రంగా చితకబాదింది. సంక్రాంతి సెలవుల్లో హోం వర్క్‌ చేయలేదని తోటి విద్యార్థుల ముందే విచక్షణారహితంగా కర్రతో కొట్టింది. విషయం తెలుసుకున్న ఆ విద్యార్థి తల్లి స్కూలుకు చేరుకుని  ఇంగ్లిషు టీచర్‌తో వాగ్వాదానికి దిగింది. తప్పు చేస్తే మందలించాలే తప్ప శరీరంపై వాతలు పడేలా కొడతారా అని నిలదీశారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.  

మరిన్ని వార్తలు