గిద్దలూరు : ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని ఎనుమలేరు వాగు గురువారం ఉప్పొంగి ప్రవహించింది. తెల్లవారుజామున నల్లమల అటవీ ప్రాంతంలో గంటపాటు కురిసిన భారీ వర్షంతో వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో వెంకటాపురం గ్రామంలోని సుమారు 15 ఎకరాల్లొని పొలాలు నీట మునిగాయి.
విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ఈ వాగు మధ్యలోనే గుళ్లమోతు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. తూములు ఇంకా ఏర్పాటు చేయకపోవడంతో నీరు వృధాగా పోయినట్లు అయింది.