ఒంగోలు రైల్వేస్టేషన్‌లో ఎస్కలేటర్ ప్రారంభం

20 Mar, 2016 14:17 IST|Sakshi
ఒంగోలు రైల్వేస్టేషన్‌లో ఎస్కలేటర్ ప్రారంభం

ఒంగోలు : ప్రకాశం జిల్లా ఓంగోలు రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఎస్కలేటర్‌ను వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, డివిజినల్ రైల్వే మేనేజర్ అశోక్‌కుమార్లు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు, సదుపాయాల గురించి ఎంపీ... డీఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లారు.

ప్రయాణికులు దిగేందుకు కూడా ఓ ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేయాలని, స్టేషన్‌కు రెండో వైపున టికెట్ కౌంటర్ ఏర్పాటుతోపాటు, జిల్లాలో రాజస్థాన్ ప్రజలు ఎక్కువగా ఉన్నందున ఆ రాష్ట్రానికి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని వైవీ సుబ్బారెడ్డి డీఆర్‌ఎంను కోరారు. వీటి పట్ల డీఆర్‌ఎం సుముఖంగా స్పందించారు.

మరిన్ని వార్తలు