లాలాగూడ పీఎస్ పరిధిలోని లాలాపేట పోచమ్మ గుడి వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోచమ్మగుడి స్థలం వివాదం నేపథ్యంలో నగర మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఆ దేవాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దాంతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో ఆమెతోపాటు 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్స్టేషన్కు తరలించారు.