మాజీ మంత్రి ఇంట్లో విషాదం

13 May, 2020 12:30 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి జిల్లా(పిఠాపురం): తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి కొప్పన మోహన్‌ రావు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కొప్పన మోహన్ రావు సతీమణి రమాదేవి అనారోగ్యంతో కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆమె మృతిపట్ల పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుతోపాటూ పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు