వరద ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే పర్యటన

20 Nov, 2015 16:25 IST|Sakshi

బుట్టాయగూడెం (పశ్చిమ గోదావరి) : పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు శుక్రవారం పర్యటించారు. ఇప్పలపాడు, నిమ్మలగూడెం గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న వరి పొలాలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను తెలుసుకున్నారు. బాధిత రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఎకరానికి రూ.10వేల చొప్పున ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని బాలరాజు కోరారు.

మరిన్ని వార్తలు